'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' ముగ్గులు వేసిన పరిటాల సునీత.. ఫొటోలు ఇవిగో

  • వెంకటాపురంలో తన నివాసం ముందు ముగ్గులు
  • అమరావతి పరిరక్షణ సమితికి మద్దతు
  • అమరావతి రైతులకు, మహిళలకు సంఘీభావం
అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో తన నివాసం ముందు మాజీ మంత్రి పరిటాల సునీత 'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' అని ముగ్గులు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె ఇలా రైతులకు మద్దతు తెలుపుతూ ముగ్గులు వేశారు.  
            
 ఈ విషయాన్ని తెలుపుతూ పరిటాల శ్రీరామ్ ట్వీట్ చేశారు. 'రాప్తాడు నియోజకవర్గంలోని వెంకటాపురంలో తమ ఇంటి ముందు, 'సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్' అని ముగ్గులు వేసి  అమరావతి రైతులకు, మహిళలకు సంఘీభావం ప్రకటించిన పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ ఇతర కుటుంబసభ్యులు' అని ఆయన పేర్కొన్నారు.      
Go Back to Shorts
paritala sunita
Andhra Pradesh
Amaravati

More Telugu News